Mahesh Babu: అప్పుడు జంటగా.. ఇప్పుడు పాట కోసం.. మహేష్తో స్పెషల్ సాంగ్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ.. – Telugu News | Actress Kiara Advani Special song with Mahesh Babu in Guntur Karam Movie telugu cinema news
వెకేషన్ తర్వాత మహేష్.. తిరిగి గుంటూరు కారం సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.ఇందులో మీనాక్షి చౌదరీ, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇప్పుడు చివరి దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక గతంలో విడుదలైన టీజర్ తో మూవీపై మరింత హైప్ నెలకొంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. తన కుటుంబంతో కలిసి గడుపుతున్న ఫోటోస్ ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉన్నారు. వెకేషన్ తర్వాత మహేష్.. తిరిగి గుంటూరు కారం సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.ఇందులో మీనాక్షి చౌదరీ, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇప్పుడు చివరి దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక గతంలో విడుదలైన టీజర్ తో మూవీపై మరింత హైప్ నెలకొంది. అయితే ఈ సినిమా గురించి అనేక రూమర్స్ నెట్టంట చక్కర్లు కొట్టాయి. కానీ వీటిపై ఇప్పటివరకు చిత్రయూనిట్ స్పందించలేదు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
గుంటూరు కారం చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందట. అందులో మహేష్ తోపాటు.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ స్టెప్పులేయనుందని టాక్. గతంలో వీరిద్దరు కలిసి భరత్ అనే నేను సినిమాలో నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ అయినప్పటికీ కియారా తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తోన్న కియారా.. ఇప్పుడు మరోసారి మహేష్ బాబు చిత్రంలో కనిపించనుంది. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో మహేష్, కియారా మధ్య వచ్చే స్పెషల్ సాంగ్ హైలెట్ కానుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. మహేష్ బాడీ లాంగ్వేజ్ కు సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ సినిమా కథను ప్లాన్ చేశాడట. తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుందట. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. గుంటూరు కారం తర్వాత మహేష్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.