Leading News Portal in Telugu

CM Kcr: మహారాష్ట్రలో గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచుతాం.. కేసీఆర్ కీలక కామెంట్స్.. – Telugu News | Telangana Cm Kcr Key Comments on NDA Govt with Maharashtra Leaders


మహారాష్ట్రలో పట్టు సాధిస్తే.. దేశ వ్యాప్తంగా విస్తరించొచ్చని భావిస్తున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలోనే.. ఆ రాష్ట్రంలోని కీలక నేతలను బీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని సోలాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్‌లు సోమవారం తెలంగాణ‌ భవన్ వేదికగా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో పార్టీని గెలిపించేందుకు..

మహారాష్ట్రంలో బీఆర్ఎస్‌ పార్టీని గెలిపిస్తే కేంద్రం మేడలు వంచుతామని, దేశాభివృద్ధికి తోడ్పాటునందిస్తామని అన్నారు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్. మహారాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 65 లోక్‌సభ స్థానాలు ఉన్నాయని, ఈ సీట్లలో బీఆర్ఎస్‌ గెలిస్తే.. కేంద్రంలో బీఆర్ఎస్ లేకుండా ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితి ఉండదన్నారు. ఈ రకంగా దేశానికి నేతృత్వం వహించే ఛాన్స్ వస్తుందని కేసీఆర్ పేర్కోన్నారు.

బీఆర్ఎస్‌ పేరుతో జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచిన గులాబీ దళపతి కేసీఆర్.. ముందుగా పొరుగు రాష్ట్రమై మహారాష్ట్రపై గురిపెట్టారు. మహారాష్ట్రలో పట్టు సాధిస్తే.. దేశ వ్యాప్తంగా విస్తరించొచ్చని భావిస్తున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలోనే.. ఆ రాష్ట్రంలోని కీలక నేతలను బీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని సోలాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్‌లు సోమవారం తెలంగాణ‌ భవన్ వేదికగా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్.

ఈ చేరికల సందర్భంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మహారాష్ట్రతో పాటు యావత్ భారతేదశం అభివృద్ధి కుంచించుకుపోతోందన్నారు. అంబానీ, అదానీల ప్రభుత్వం కాదు.. రైతులు, పేదల అభివృద్ధి లక్ష్యంగా దేశంలో రైతు ప్రభుత్వం రావాలని అన్నారు సీఎం. రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యం అని, అందుకే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాన్ని అందిపుచ్చుకున్నమాని పేర్కొన్నారు కేసీఆర్.

దేశాన్ని అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారంటూ ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్. దేశంలో ఉన్న వనరులన్నింటినీ ఆ ఇద్దరికీ కట్టబెడుతున్నారని ఆరోపించారు. దేశంలో విస్తారమైన బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ.. ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. బొగ్గు నిల్వలను అదానీ, అంబానీలకు అప్పగించి, తద్వారా విద్యుత్ బిల్లులు పెంచి, పేదలను దోచుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వికృత చేష్టలివి అని ఫైర్ అయ్యారు.

ఇదే సమయంలో తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి కూడా ప్రస్తావించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, అమలవుతున్న పథకాలను మహారాష్ట్రకు చెందిన దాదాపు 20 వేల మంది స్వయంగా వచ్చి పరిశీలించి వెళ్లారని తెలిపారు సీఎం. దేశానికి కొత్త పార్టీ అవసరం ఉందని, మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే.. రెండు మూడేళ్లలో కరెంట్ కష్టాలే ఉండవని, రైతుల వ్యవసాయ సాగుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..