Karnataka: పెళ్లి చేసుకునేందుకు పిల్లనివ్వలేదని రెచ్చిపోయిన యువకుడు.. అర్థరాత్రి వేళ చొరబడి ఏం చేశాడంటే.. – Telugu News | Karnataka Boy Destroys 850 Arecanut Trees for Not Marrying Off Daughter, Know Shocking Details
పెళ్లిడీకొచ్చాడు.. ఏం చేస్తారు.. అమ్మాయి కోసం వెతుకుతారు.. ఈడు జోడు కలిస్తే.. ఇద్దరికీ ముహూర్తం ఫిక్స్ చేసి పెళ్లి చేస్తారు.. ఒకవేళ పెళ్లి విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటారు.. కానీ, ఇక్కడ ఓ యువకుడు మాత్రం పెళ్లి కోసం రెచ్చిపోయి రచ్చ చేశాడు. రైతు ఎంతో కష్టపడి పండించిన పంటను క్షణాల్లో ధ్వంసం చేశాడు. అతని చర్యతో ఆ రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. ఇంతకీ ఆ యువకుడికి అంత అక్కసు ఎందుకు? ఎందుకలా పంటను ద్వంసం చేయాల్సి వచ్చింది? అసలేం జరిగిందో వివరాలు తెలుసుకుందాం..
పెళ్లిడీకొచ్చాడు.. ఏం చేస్తారు.. అమ్మాయి కోసం వెతుకుతారు.. ఈడు జోడు కలిస్తే.. ఇద్దరికీ ముహూర్తం ఫిక్స్ చేసి పెళ్లి చేస్తారు.. ఒకవేళ పెళ్లి విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటారు.. కానీ, ఇక్కడ ఓ యువకుడు మాత్రం పెళ్లి కోసం రెచ్చిపోయి రచ్చ చేశాడు. రైతు ఎంతో కష్టపడి పండించిన పంటను క్షణాల్లో ధ్వంసం చేశాడు. అతని చర్యతో ఆ రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. ఇంతకీ ఆ యువకుడికి అంత అక్కసు ఎందుకు? ఎందుకలా పంటను ద్వంసం చేయాల్సి వచ్చింది? అసలేం జరిగిందో వివరాలు తెలుసుకుందాం..
మైసూర్లోని హునాసూర్ తాలూకాలో కడే మనుగనహళ్లి గ్రామానికి చెందిన యువకుడు అశోక్.. అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే రైతు 3 ఎకరాల ‘వక్క’ పంటను ధ్వంసం చేశాడు. చేతికందివచ్చిన పంటను పూర్తిగా ధ్వంసం చేయడంతో ఆ రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అయితే, ఈ యువకుడు అలా చేయడానికి కారణం పెళ్లి అని చెబుతున్నారు స్థానికులు. అవును, వెంకటేష్కు ఓ కూతురు ఉంది. ఆమెను అశోక్కు ఇచ్చి పెళ్లి చేసేందుకు పరస్పరం చర్చలు కూడా జరిగాయి. అయితే, అబ్బాయి తీరు సరిగా లేదని పెళ్లికి అంగీకరించలేదు. అప్పటి నుంచి వెంకటేష్ కుటుంబంపై ధ్వేషం పెంచుకున్నాడు అశోక్.
ఈ వ్యవహారం కొన్నేళ్ల క్రితం చోటు చేసుకోగా.. అప్పటి నుంచి అశోక్కి వెంకటేష్ కుటుంబంపై ధ్వేషం తగ్గలేదు. ఈ నేపథ్యంలో గత రాత్రి వెంకటేష్ పొలం వద్దకు వెళ్లి.. 3 ఎకరాల్లో వేసిన వక్క పంటను పూర్తిగా నరికేశాడు. మరుసటి రోజు ఉదయం వెంకటేష్ తన పొలం వద్దకు వచ్చి చూడగా చెట్లన్నీ నేలకూలి ఉన్నాయి. వాటిని చూసి బోరున విలపించాడు వెంకటేష్. ఎవరు ఈ చర్యకు పాల్పడ్డారా? అని ఆరా తీయగా.. అశోక్ అని తేలింది. దాంతో హున్సూర్ రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి అశోక్పై ఫిర్యాదు చేశాడు వెంకటేష్. తన పంటను మొత్తం నాశనం చేశాడని కంప్లైంట్ ఇచ్చాడు. బాధితుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అశోక్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాదాపు 3 ఎకరాల్లో 850 వక్క చెట్లను ధ్వసం చేసినట్లు తెలిపాడు బాధితులు. అయితే, అశోక్ గతంలోనూ ఇలాగే తన పంటను ధ్వంసం చేసినట్లు ఆరోపించాడు వెంకటేష్. తన కూతురుని ఇచ్చి పెళ్లి చేయలేదనే అక్కసుతో గతంలో అర ఎకరంలో సాగు చేసిన అల్లం పంటను ధ్వంసం చేసినట్లు చెప్పాడు. ఇప్పుడు మళ్లీ వక్క పంటను ధ్వంసం చేశాడుని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..