Leading News Portal in Telugu

Congress: అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు.. ప్రకటన ఎప్పుడో తెలుసా..?


తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడిది చివరలో జరుగనున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ కంటే చాలా ముందుగానే ఎమ్మెల్యేల అభ్యర్ధులను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ గాంధీ భవన్ లో సమావేశమైంది. ఎమ్మెల్యే అభ్యర్ధుల ఎంపిక విషయంలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలోని కమిటీ తీవ్రంగా చర్చించింది. పార్టీ టిక్కెట్లు ఆశించే వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అయితే, జనరల్ అభ్యర్థులు రూ. 10 వేలు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థుల నుంచి రూ.2500 ఫీజు వసూలు చేయాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ నెల 18వ తేదీ నుంచి టిక్కెట్లు ఆశించే అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కాంగ్రెస్ అధిష్టానం స్వీకరించనుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే తెలంగాణలో అమలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటుంది. ముందుగానే పోటీ చేసే అభ్యర్ధులను ప్రకటించాలని చూస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులను ముందుగా ప్రకటించేందుకు ప్లాన్ చేస్తుంది. అభ్యర్ధుల ఎంపికలో సర్వేలతో పాటు ఇతర అంశాలను కూడా ప్రామాణికంగా తీసుకుంటామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చారు.

ఇక, పార్టీ నాయకత్వానికి ఇబ్బందులు లేని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్ధుల పేర్లను ఈ నెల 17వ తేదీ తర్వాత ప్రకటిస్తే ఎలా ఉంటుందనే దానిపై పార్టీలో చర్చ జరుగుతుంది. ఇంకా ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే, ఈ నెల లాస్ట్ వరకు 40 మంది క్యాండిడెట్లను ఖరారు చేసేందుకు స్క్రీనింగ్ కమిటీ సన్నహాలు రెడీ చేస్తుంది. రిసెంట్ గా జరిగిన మీటింగ్ లో టిక్కెట్ల కోసం పోటీ లేని అసెంబ్లీ నియోజకవర్గాలపై పార్టీ స్క్రీనింగ్ కమిటీ నజర్ పెట్టింది. పోటీ పడే అభ్యర్థుల బలాబలాలపై పార్టీ అధిష్టానం చర్చిస్తుంది.

అయితే, అభ్యర్థుల ఎంపికను పార్టీ సర్వే రిపోర్టుతో పాటు సామాజిక అంశాలను కూడా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ పరిశీలించనుంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించే తొలి జాబితాలో బీసీ అభ్యర్ధుల పేర్లు ఉంటాయని తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు కనీసం 50 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని అడిగారు.. కానీ.. 50 సీట్లు ఇవ్వకపోయినా కనీసం 20 నుంచి 30 సీట్లు ఇస్తారని బీసీ వర్గానికి చెందిన కొందరు నేతలు అనుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇందుకోసం ఇతర పార్టీల్లో అసంతృప్తులకు గాలం వేస్తుంది. మరోవైపు.. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్.. తెలంగాణలో గెలిచేందుకు సన్నాహాలు చేస్తుంది.