కొకైన్ ను సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్.. రూ.15 కోట్ల కొకైన్ సీజ్..
డఫిల్ బ్యాగ్లో దాచి ఇథియోపియా నుంచి ముంబైకి రూ. 15 కోట్ల విలువైన కొకైన్ను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు (డిఆర్ఐ) అరెస్టు చేసింది.. నేవీ ముంబైలో నిషిద్ధ వస్తువులను డెలివరీ చేయడానికి అంగీకరించాల్సిన ఉగాండా మహిళను కూడా DRI అరెస్టు చేసింది. ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల ఆధారంగా, అడిస్ అబాబా నుండి ముంబైకి ఇటి 640 విమానం ద్వారా వచ్చిన కేరళకు చెందిన సాట్లీ థామస్ (44) శుక్రవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డారని డిఆర్ఐ ఆదివారం తెలిపింది..
అతని లగేజీని పరిశీలించగా, అక్రమ మార్కెట్లో దాదాపు రూ.15 కోట్ల విలువైన కొకైన్గా భావించే 1,496 గ్రాముల వైట్ పౌడర్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.. ప్రయాణీకుల నిరంతర విచారణ, నిఘా ఆధారంగా, DRI అధికారులు ఒక ఉచ్చును వేశాడు. నేవీ ముంబైలోని వాషి వద్ద డ్రగ్స్ సేకరించడానికి వచ్చిన గ్రహీత, నకిరిజ్జా ఆలిస్ (37)ని పట్టుకున్నారు. రూ.1.5 లక్షల కమీషన్ ఇస్తానని థామస్కు వాగ్దానం చేసినట్లు ఒక మూలం తెలిపింది. అతను డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడని కూడా ఆరోపించబడ్డాడని, ఇదే ప్రయోజనాల కోసం ఇథియోపియా, మలావి, జింబాబ్వే, దక్షిణాఫ్రికాకు వెళ్లాడని మూలం జోడించింది. ఈ పని ద్వారా అతను ఇప్పటివరకు రూ. 5 లక్షలకు పైగా సంపాదించాడని సంబంధిత వర్గాలు తెలిపాయి..
భూపాలపల్లి నియోజకవర్గానికి పాకిన బీఆర్ఎస్ అసమ్మతి
వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గానికి బీఆర్ఎస్ అసమ్మతి పాకింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్రకు టికెట్ ఇస్తే నామినేషన్ వేసేందుకు 150మంది ఉద్యమకారులు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిపై ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి వర్గీయుల తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో మధుసూదనాచారి ఫాలోవర్స్ సమావేశమయ్యారు. చారి సాబ్ కే టికెట్ ఇవ్వాలని అధిష్ఠానానికి అల్టిమేటం.. బీఆర్ఎస్ పార్టీ హై కమాండక్ కు మరో కొత్త తలనొప్పి మొదలైంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇప్పటికే జనగామ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టికెట్ గొడవ జరుగుతుంటే మరోవైపు భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్ విషయం కూడా రచ్చకెక్కింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని తెలంగాణ ఉద్యమకారులు పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గండ్రకు టికెట్ ఇస్తే 150మంది తెలంగాణ ఉద్యమకారులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తామని పేర్కొన్నారు. నియోజ కవర్గానికి చెందిన మధుసూదనా చారి అనుచరులు హైదరాబాద్ లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.
పాడేరులో ఘోర రోడ్డు ప్రమాదం.. 100 అడుగుల లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. మోదమాంబ పాదాలకు 3 కి.మీ దూరంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన బస్సులో సుమారు 25 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 23 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు చోడవరం నుంచి పాడేరు వెళుతుండగా ప్రమాదం జరిగింది. అయితే బస్సు డ్రైవర్ చెట్టు కొమ్మను తప్పించబోవడంతో బస్సు లోయలోకి దూసుకుపోయింది. సుమారు బస్సు 100 అడుగుల లోయలోకి పడిపోయింది. ఘాట్ రోడ్డులోని వ్యూ పాయింట్ వద్ద మలుపు తిరుగుతుండగా, బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది.
పాడేరు ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. సుమారు 100 అడుగుల లోయలో పడ్డ ఘటనలో.. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 23 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశం ఇచ్చారు. క్షతగాత్రులకు మంచి ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని.. ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు సీఎం. అంతేకాకుండా.. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారులకు తెలిపారు. ఘటనకు దారితీసిన కారణాలపై అధికారులు దృష్టి సారించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
పాక్లో మరణ మృదంగం.. వేర్వేరు ఘటనల్లో 29 మంది మృతి
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో బాంబు పేలుడు జరిగింది. వజీరిస్థాన్లోని గుల్మిర్కోట్ ప్రాంతంలో ఓ వ్యాన్ కార్మికులతో వెళ్తున్న వ్యాన్ను ఉగ్రవాదులు పేల్చివేశారు. శనివారం షావాల్ తహసీల్లోని గుల్మీర్ కోట్ సమీపంలో 16 మంది కూలీలతో వెళ్తున్న వాహనాన్ని ఉగ్రవాదులు పేల్చివేశారని డిప్యూటీ కమిషనర్ రెహాన్ గుల్ ఖట్టక్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో 11 మంది కార్మికులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనంలో పనిచేస్తున్న కనీసం 11 మంది కార్మికులు అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కూలీలు మాకిన్, వానా తహసీల్లకు చెందినవారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రభుత్వం రాష్ట్రం లో భూ దందా చేస్తోంది
నిర్మల్ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టిన నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డికి మద్దతు తెలపడానికి వెళుతున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో డీకే అరుణ మాట్లాడుతూ… నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రైతుల కోసం గత ఐదు రోజుల గా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే అతడినీ పరామర్శించడానికి వెళ్తే నన్ను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం.. సీఎం కేసీఆర్ నియంతల వ్యవహరిస్తున్నాడు…ఈ దుబాయ్ షేక్ అని ఆమె అన్నారు. నిర్మల్ ఇందలవాయి వద్ద నన్ను పోలీసులు అడ్డుకున్నారని, పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్రం లో భూ దందా చేస్తోందని ఆమె ఆరోపించారు.
కేంద్ర హోం శాఖపైనే అధికంగా అవినీతి ఫిర్యాదులు.. సీవీసీ నివేదికలో కీలక విషయాలు
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) 2022 సంవత్సరానికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ఈ వార్షిక నివేదికలో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులపై గతేడాది అత్యధికంగా అవినీతి ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది. ఆ తర్వాత రైల్వే, బ్యాంకుల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులపై ఫిర్యాదులు వచ్చాయి. 2022లో కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలలోని అన్ని కేటగిరీల అధికారులు, ఉద్యోగుల నుంచి మొత్తం 1,15,203 ఫిర్యాదులు వచ్చాయని నివేదికలో పేర్కొంది. వీటిలో 85,437 పరిష్కారం కాగా 29,766 పెండింగ్లో ఉన్నాయి. వీటిలో 22,034 ఫిర్యాదులు మూడు నెలలకు పైగా పెండింగ్లో ఉన్నాయి.
బీబీనగర్, భువనగిరి చెరువులకు కొత్త అందాలు
బీబీనగర్, భువనగిరి చెరువులకు కొత్త అందాలతో ఆకర్షణీయంగా మారబోతున్నాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రం సందర్శనకు వస్తున్న భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో ఆ మార్గంలో ఉన్న బీబీనగర్, భువనగిరి(పెద్ద చెరువు) చెరువులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కి అప్పగించింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశాల మేరకు ఎంఏయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్విoద్ కుమార్ పర్యవేక్షణలో ఇంజనీరింగ్, అర్బన్ ఫారెస్ట్ అధికారులు దాదాపు రూ.17 కోట్ల వ్యయంతో బీబీనగర్, భువనగిరి చెరువుల బ్యూటిఫికేషన్ పనులను హెచ్ఎండీఏ నిర్వహించనున్నది.
సూర్యాపేటకు సీఎం కేసీఆర్ వరాల జల్లు..
సూర్యాపేట జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. సూర్యాపేటలోని 475 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ చేయమని మంత్రి జగదీష్ రెడ్డి పట్టుబట్టినట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో 475 గ్రామ పంచాయితీకి 10లక్షల, మున్సిపాలిటీ లకు 25కోట్లు, సూర్యాపేట మున్సిపాలిటీ కి 50కోట్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. 25కోట్లతో సూర్యాపేటకు కళాభారతి మంజూరు చేస్తామని ఆయన అన్నారు. ఆర్ & బీ బిల్డింగ్ మంజూరు చేస్తామన్నారు. అయితే.. ఎన్నికలు రాగానే నాయకులు వస్తారని, బీజేపీ, కాంగ్రెస్ కొత్త పార్టీలు కావని, 50ఏళ్లు అధికారం ఇస్తే కాంగ్రెస్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.
మామ మోసం చేశాడు, ఈ చాచాను నమ్మండి.. కేజ్రీవాల్ హామీల వర్షం
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం మధ్యప్రదేశ్లోని సాత్నాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో తమ పార్టీ మార్పు తీసుకువస్తుందని ఆయన అన్నారు. ఆప్ టౌన్ హాల్ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను ‘మామా’ అని పిలుస్తూ, “మధ్యప్రదేశ్లో ఒక మామా ఉన్నారని నాకు తెలుసు. ఆయన తన మేనల్లుళ్లు, మేనకోడళ్లను మోసం చేశారు. ఆయనను నమ్మవద్దు.” అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తనను తాను చాచా అని సంబోధించుకున్న కేజ్రీవాల్.. తమ పార్టీ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో పాఠశాలలు, ఆసుపత్రులు, ఉపాధి అవకాశాలను తీసుకువస్తానని పేర్కొన్నారు. ఇప్పుడు మీ చాచా వచ్చారని.. మీ మామను నమ్మవద్దని, చాచాపై నమ్మకం ఉంచాలని ఓటర్లను కేజ్రీవాల్ కోరారు.
కిలో ఉల్లి రూ.25కే.. రేపట్నుంచే విక్రయం
పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ధరలను నియంత్రించడంతో పాటు సరఫరాను మెరుగుపరిచేందుకు వీలుగా ఉల్లి ఎగుమతులపై శనివారం 40శాతం సుంకాన్ని విధించిన సంగతి తెలిసిందే. ఉల్లి బఫర్ స్టాక్ను 300,000 మెట్రిక్ టన్నుల నుండి 500,000 మెట్రిక్ టన్నులకు పెంచినందున, ఉల్లి బఫర్ స్టాక్ను నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య-ఎన్సీసీఎఫ్) ద్వారా సోమవారం నుంచి కిలోకు రూ. 25 చొప్పున సబ్సిడీపై విక్రయించనున్నట్లు కేంద్రం ఆదివారం తెలిపింది. అక్టోబర్లో కొత్త పంట వచ్చే వరకు ఉల్లి ధరలను అదుపులో ఉంచాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.