
Rajinikanth: ఇస్రో.. ఎట్టేకలకు అనుకున్నది సాధించింది. ఎన్ని అవమానాలు పడినా తిరిగి నిలబడింది. ఇండియా పేరును ప్రపంచ దేశాల్లో మారుమ్రోగేలా చేసింది. చంద్రయాన్ 3 విజయం అందుకుంది. ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది. ఈరోజు చరిత్రలో నిలబడిపోయేలా చేసింది. అగ్రరాజ్యాలు అన్ని ఇండియా వైపు చూసేలా చేసింది. ఇక చంద్రయాన్ 3 సక్సెస్ ను చూసి ఇండియన్స్ గాల్లో తేలిపోతున్నారు. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టి అక్కడ ఫోటోలను కూడా తీసుకొచ్చేస్తుంది. ఇక ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రయాన్ 3 సక్సెస్ పై స్పందించాడు. ఈ సక్సెస్ భారతీయలను గర్వపడేలా చేసింది అంటూ ట్వీట్ చేశాడు.
Akshay Kumar: చంద్రయాన్ 3 బయోపిక్.. హీరో ఎవరంటే.. ?
” అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాలు ఆశ్చర్యంతో చూస్తుండగా, భారతదేశం ఈ భారీ విజయంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మొట్టమొదటిసారిగా, చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 ని ల్యాండ్ చేయడం ద్వారా మన దేశం ఒక గొప్ప గుర్తింపును అందుకుంది. మన ఇస్రో శాస్త్రవేత్తల టీమ్ కు నా హృదయపూర్వక అభినందనలు. మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక రజినీ సినిమాల విషయానికొస్తే.. జైలర్ విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సినిమా తరువాత రజినీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
While superpowers like the US, Russia, and China watch in agast amazement, India stuns the world with this humongous achievement.
For the first time ever, our nation stamps it’s proud identity by landing #Chandrayaan3 on the south pole of the moon!
My heartfelt congratulations…
— Rajinikanth (@rajinikanth) August 23, 2023