శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు | devotees rush in tirumala| hundi| kanukalu| compartments| pilgrims
posted on Aug 26, 2023 12:52PM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం 9 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 14 గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని 69వేల529 మంది దర్శించుకున్నారు.
29వేల 227 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 85లక్షల రూపాయలు వచ్చింది.