
Anushka: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తుందా.. ? అంటే నిజమనే చెప్పాలి. దాదాపు నిశ్శబ్దం సినిమా తర్వాత స్వీటీ సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది. ఇక మధ్యలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఆమె ఇక సినిమాలు చేయదని, కొంతమంది అంటే అనుష్క పెళ్లి చేసుకోబోతుంది.. అందుకే సినిమాలకు దూరమైందని ఇంకొందరు చెప్పుకొచ్చారు. కొంతమంది ఆమె బరువు పెరగడం వల్లనే సినిమాలకు దూరమైందని ట్రోల్స్ చేశారు.ఇక వీటన్నింటికి చెక్ పెడుతూ అనుష్క ఈ ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ నిర్మిస్తుంది. మొట్టమొదటిసారి జాతి రత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి.. అనుష్క శెట్టి లాంటి స్టార్ హీరోయిన్ తో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో నవీన్ పోలిశెట్టి వరుసగా ప్రమోషన్స్ చేస్తూ బిజీగా మారాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో అనుష్క ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని అభిమానులు అందరూ వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. కానీ వారికి నిరాశనే మిగిలింది.
Kalki 2898AD: బిగ్ బ్రేకింగ్.. కల్కి ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టిన రాజమౌళి ..?
ప్రమోషన్స్ విషయంలో అనుష్క ఒక కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. ఆమె ప్రమోషన్స్ లో బయటికి కనిపించేలాగా అయితే పాల్గొనదని తెలుస్తుంది. అంటే మీడియా ముందుగానీ, కెమెరా ముందుగానీ ప్రమోషన్స్ చేస్తూ అనుష్క కనిపించదట. వెబ్ ఇంటర్వ్యూస్, ఎఫ్ఎం చాట్, ఫోన్లో మాట్లాడడం ఇలాంటివి చేస్తుందట. ఇక అందుతున్న సమాచారం ప్రకారం అనుష్క రాకపోవడం వల్లనే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా క్యాన్సిల్ చేశారని తెలుస్తుంది. దీంతో అభిమానుల్లో చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. అనుష్క ఎప్పుడు ఇలా చేయలేదు.. కానీ, మొట్టమొదటిసారి ఆమె ప్రమోషన్స్ రాకపోవడానికి కారణం ఏంటి అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు. అయితే అనుష్క బరువు పెరగడం వలనే ఆమె మీడియా ముందుకు రాలేకపోతుందని, ఇంటర్వ్యూ చేస్తే ట్రోల్స్ చేస్తారని భయంతోనే స్వీటీ ఇలా చేస్తుందని చెప్పుకొస్తున్నారు.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి.