Leading News Portal in Telugu

Gold Today Price: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!


Gold Today Price in Hyderabad 30th August 2023: నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం (ఆగష్టు 30) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,670గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 250.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 270 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. దేశంలోని ప్రధాన నగరాల్లో తులం బంగారం రేటు ఎలా ఉందో ఓసారి తెలుసుకుందాం.

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,820గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,200లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,220 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,700లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర 59,670గా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,700 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670 వద్ద కొనసాగుతోంది.

మరోవైపు వెండి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర బుధవారం రూ. 77,100లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 200 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 77,100గా ఉండగా.. చెన్నైలో రూ. 80,200గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 75,700గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 80,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,000గా ఉంది.