Leading News Portal in Telugu

Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు! ఏకంగా 60 వేలు


Gold Today Price in Hyderabad on 31st August 2023: పసిడి ప్రియులకు షాక్. వరుసగా రెండోరోజు బంగారం ధరలు పెరగ్గా.. నేడు మరింత ప్రియం అయింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (ఆగష్టు 31) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,000గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 300.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 330 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేడు ఉదయం నమోదైనవి. ఇక దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,150గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,330 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000గా కొనసాగుతోంది.

వెండి ధరలు కూడా నేడు స్వల్పంగా పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర గురువారం రూ. 77,600లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 500 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 77,600గా ఉండగా.. చెన్నైలో రూ. 80,700గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,750 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 80,700లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,700ల వద్ద కొనసాగుతోంది.