Leading News Portal in Telugu

శ్రీవారి హుండీ కానుకలు రూ.4.06 కోట్లు | devotees rush in tirumala| hundi| kanukalu| sarva| darshnam| compartments


posted on Aug 31, 2023 7:26AM

తిరుమలలో శ్రీవారి రద్దీ కొనసాగుతోంది. గురువారం (ఆగస్టు 31)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులతో 18 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం  (ఆగస్టు 30) శ్రీవారిని 71వేల 132 మంది దర్శించుకున్నారు.

26వేల 963 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 6 లక్షల రూపాయలు వచ్చింది.