Sound Party First Lyrical Goes Viral: వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటిస్తున్న తాజా మూవీ సౌండ్ పార్టీ. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రూపొందుతున్న ఈ సినిమాకి రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా దర్శకుడు జయ శంకర్ సమర్పిస్తున్నాడు. సంజయ్ శేరి దర్శకుడుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఇక ఈ సినిమా నుండి `మని మని మని మనీ దీని ముఖములు సోమెనీ` అనే లిరికల్ వీడియో సాంగ్ లాంచ్ చేయగా అది యూట్యూబ్ లో బాగా వైరల్ అయింది. డబ్బు ప్రాధాన్యత గురించి యువ రచయిత పూర్ణచారి ప్రజంట్ ట్రెండ్ కి కనెక్టయ్యే విధంగా పాట రాయగా మోహిత్ రెహమానిక్ దానికి తగ్గట్టుగా మాంచి బీట్ తో మ్యూజిక్ అందించారు. యూట్యూబ్ లో వైరల్ అయిన ఈ సాంగ్ మీద రీల్స్ కూడా చేసేస్తున్నారు. ఇక శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోన్న ఈ సౌండ్ పార్టీ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
Rajinikanth: పీఎంతో జైలర్ భేటీ!
తాజాగా ఈ సినిమా నిర్మాత రవి పోలిశెట్టి మాట్లాడుతూ ఎప్పుడైతే మా `సౌండ్ పార్టీ` చిత్రం టీజర్ విడుదలైందో అప్పటి నుంచి మా `సౌండ్ పార్టీ` చిత్రానికి మంచి మంచి బజ్ వచ్చిందని, ముఖ్యంగా టీజర్ లో వీజే సన్నీ, శివన్నారాయణ చెప్పిన డైలాగ్స్ తో సినిమాలో ఎలాంటి హ్యుమర్ ఉండబోతుందో అర్థమవుతోందని అన్నారు. ప్రస్తుతం పాటలు సినిమాకు ఎంత ప్లస్ అవుతున్నాయో, సినిమాను పబ్లిక్ లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నాయో చూస్తున్నామని పేర్కొన్న ఆయన ఈ తరుణంలో మా సినిమా నుండి రిలీజైన ఫస్ట్ లిరికల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సంగీత దర్శకుడు మోహిత్ రెహమానిక్ అద్భుతమైన పాటలతో పాటు సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోరు చేశారని, అలాగే సమర్పకుడు జయ శంకర్ , దర్శకుడు సంజయ్ శేరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నారని ఆయన అన్నారు.