తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi
posted on Sep 16, 2023 11:10AM
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. శనివారం (సెప్టెంబర్ 16) శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి చూడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ లైన్ లో దర్శనానికి అనుమతిస్తున్నారు.
ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శుక్రవారం (సెప్టెంబర్ 15) శ్రీవారికి మొత్తం 62వేల357 మంది దర్శించుకున్నారు.
వారిలో 23 వేల 570 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 37లక్షల రూపాయలు వచ్చింది.