Leading News Portal in Telugu

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi


posted on Sep 20, 2023 9:02AM

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. బుధవారం (సెప్టెంబర్ 20)ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులు రెండు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. ఇక మంగళవారం(సెప్టెంబర్ 19) శ్రీవారిని 67వేల 267 మంది దర్శించుకున్నారు.

వారిలో 20వేల629 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2.85 కోట్ల రూపాయలు వచ్చింది.