Leading News Portal in Telugu

Virat Kohli: ఆసీస్ ప్లేయర్లను టీజ్ చేసిన విరాట్ కోహ్లీ


గత కొన్ని నెలలుగా భారత జట్టు ఎక్కడికి వెళ్లినా వరుణుడు వెల్ కమ్ చెప్పాడు. అయితే ఆసీస్ తో మొహాలీలో జరిగిన మొదటి వన్డేలో మాత్రం వేడి తట్టుకోలేక టీమిండియా బౌలర్లు, శార్దూల్ ఠాకూర్‌తో పాటు మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. ఇక, మొహాలీలో పిచ్ బౌలర్లకు సహకరించడంతో ఆసీస్ బౌలర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. అయితే, రాజ్‌కోట్‌లో మాత్రం సీన్ మారింది. బ్యాటింగ్‌కి అద్భుతంగా అనుకూలించే రాజ్‌కోట్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు క్రీజులో కుదురుకుపోయి ఆడారు. మిచెల్ మార్ష్ 96 రన్స్ చేయగా స్టీవ్ స్మిత్ 74, మార్నస్ లబుషేన్ 72, డేవిడ్ వార్నర్ 56 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా 352 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఇక, భారత బౌలర్ల కంటే ఎక్కువగా రాజ్‌కోట్‌లో ఎండలు, ఆసీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాయి. 74 రన్స్ చేసిన స్టీవ్ స్మిత్, డ్రింక్స్ బ్రేక్‌లో తల మీద ఐస్ ప్యాక్ పెట్టుకుని రెస్ట్ తీసుకున్నాడు. ఇదే సమయంలో అక్కడే ఉన్న విరాట్ కోహ్లీ, మార్నస్ లబుషేన్ దగ్గరికి వెళ్లి క్రేజీగా డ్యాన్సులు వేయడం అక్కడి కెమెరాల్లో కనిపించింది. అయితే, విరాట్ కోహ్లీ, మార్నస్ లబుషేన్‌ని ఏదో అడగడం, దానికి అతడు ఆన్సర్ ఇవ్వడం మనకు కనిపిస్తుంది. అంటే లబుషేన్‌తో విరాట్ కోహ్లీ ఏం మాట్లాడాడో మాత్రం వినిపించలేదు.. 11 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ, క్రేజీగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.

రాజ్ కోట్ లో ఎండ, ఉక్కపోతతో ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌ తంటాలు పడిన భారత క్రికెట్ ఫ్యాన్స్‌కి తనదైన స్టైల్‌లో విరాట్ కోహ్లీ వినోదం పంచాడు. మొదటి రెండు వన్డేలకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్.. మూడో వన్డేలో రీఎంట్రీ ఇచ్చారు. మూడో వన్డేలో టీమిండియా నాలుగు మార్పులతో రంగంలోకి దిగింది. ఇషాన్ కిషన్ వైరల్ ఫివర్‌తో బాధపడుతున్నట్టు రోహిత్ శర్మ తెలిపాడు. అలాగే రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యారు.