Leading News Portal in Telugu

Supreme Court: చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం


స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ పై విచారణ ప్రారంభం అయింది. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు వాదనలు కొనసాగుతున్నాయి. ఇక, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరతూ చంద్రబాబు పిటిషన్‌ వేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు పర్మిషన్ తీసుకోకుండా కేసు నమోదు చేశారని ఈ పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను ఇటీవల ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి తిరస్కరిస్తూ.. ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు.