Leading News Portal in Telugu

CM Jagan: ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్


ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ్కి చేరుకున్నారు. సీఎం అధికారిక నివాసం 1 జన్ పథ్ కు ఆయన చేరుకున్నారు.. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై ముఖ్యమంత్రి ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే, రేపు (శుక్రవారం) వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై విజ్ఞాన్ భవన్ లో జరుగనున్న సదస్సులో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఇక, రేపు రాత్రికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. అయితే, ఢిల్లీ ఎయిర్ పోర్టులో సీఎం జగన్‌కు వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, భరత్‌, రెడ్డప్పా, అయోధ్య రామి రెడ్డి, బాలశౌరి, గోరంట్ల మాధవ్‌, రంగయ్యలు గ్రాంఢ్ వెల్ కమ్ చెప్పారు.