Leading News Portal in Telugu

Jangaon BRS: జనగామ బీఆర్ఎస్ టికెట్పై వీడిన ఉత్కంఠ


Jangaon BRS: జనగామ బీఆర్ఎస్ టికెట్పై ఉత్కంఠ వీడింది. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పల్లా, ముత్తిరెడ్డి మధ్య సయోధ్య కుదిరినట్టు సమాచారం తెలుస్తోంది. మినిస్టర్ క్లబ్ హౌస్ లో కాసేపట్లో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించుకోవాలని మంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు.. జనగామ టికెట్ ఆశావాహి మండల శ్రీరాములు, మరో ఆశావాహి కిరణ్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు.

మొత్తానికి జనగామ టికెట్ పై బీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలకు నేటితో తెరపడనున్నాయి. ఓ పక్క ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్గం.. మరోపక్క పల్లావర్గం కొద్దిరోజులుగా జనగామ బీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు కొనసాగగా… ఇప్పుడు ఆ గ్రూపు రాజకీయాలకు తెర దింపే విధంగా దిశా నిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా.. జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లాను ప్రకటిస్తున్నామంటూ కేటీఆర్.. నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు తెలియజేయనున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఈ భేటీకి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు కూడా బయటికి వచ్చాయి.