US Stock Market: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్దం రోజురోజుకు తీవ్ర తరం అవుతోంది. యుద్ధం కారణంగా ఆసియా, యూరప్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆ తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్ లోనూ క్షీణతతో ట్రేడింగ్ ప్రారంభమైంది. నాస్డాక్ 0.83 శాతం లేదా 111.43 పాయింట్ల క్షీణతతో ట్రేడవుతోంది. డౌ జోన్స్ 0.25 శాతం లేదా 82 పాయింట్ల క్షీణతతో 33,325 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎస్ అండ్ పీ 500 0.40 శాతం లేదా 17.31 పాయింట్ల క్షీణతతో 4291 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
అమెరికన్ స్టాక్ మార్కెట్ క్షీణతతో ట్రేడవుతోంది. కానీ అక్కడ మార్కెట్ భారతీయ స్టాక్ మార్కెట్ లేదా ఇతర ఆసియా దేశాల మార్కెట్లలో కనిపించినంత పతనాన్ని చూడలేదు. అయితే, ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం కారణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి పాలసీ సమావేశంలో ప్రస్తుత స్థాయిలో వడ్డీ రేట్లను ఉంచవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గల్ఫ్ ప్రాంతం మొత్తం తమ ఆధీనంలోకి రావచ్చని మార్కెట్ కూడా భయపడుతోంది.
అమెరికా స్టాక్ మార్కెట్లో క్షీణత ఉన్నప్పటికీ రక్షణ రంగ షేర్లలో మాత్రం పెరుగుదల కనిపిస్తోంది. లాక్హీడ్ మార్టిన్ షేరు 7.5 శాతం వృద్ధితో ట్రేడవుతోంది. కాగా, నార్త్రోప్ గ్రుమ్మన్ కార్ప్ షేర్లు 8.2 శాతం పెరుగుదలను చూస్తున్నాయి. అమెరికన్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ జరుగుతోంది. అయితే సెలవుల కారణంగా ట్రెజరీ మార్కెట్ మూసివేయబడింది. అంతకుముందు, ఈ యుద్ధం కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్లో పెద్ద క్షీణత కనిపించింది. ఇందులో నేటి ట్రేడింగ్ సెషన్లో పెట్టుబడిదారులు రూ. 3.81 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు. బీఎస్ఈ సెన్సెక్స్లో 500 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీలో 150 పాయింట్లు క్షీణించాయి. అయితే, మంగళవారం GIFT నిఫ్టీ సంకేతాలను విశ్వసిస్తే భారత మార్కెట్ గ్రీన్లో ట్రేడవుతుంది.