Leading News Portal in Telugu

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi


posted on Oct 12, 2023 9:23AM

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. గురువారం (అక్టోబర్ 12)ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో 8 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం శ్రీవారిని 72వేల 230 మంది భక్తులు దర్శించుకున్నారు.

వారిలో 27వేల 388 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 74 లక్షల రూపాయలు వచ్చింది.