శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi
posted on Oct 14, 2023 9:27AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5గంటల సమయం పడుతోంది. శనివారం (అక్టోబర్ 14)ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్ లో, కంపార్ట్ మెంట్లలో వేచి చూడాల్సిన అవసరం లేకుండా నేరుగా వెడుతున్నారు.
ఇక శుక్రవారం (అక్టోబర్ 13)న శ్రీవారిని 59 వేల 304 మంది భక్తులు సందర్శించుకున్నారు. వారిలో 22 వేల 391 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
హుండీ ఆదాయం 4 కోట్ల 8లక్షల రూపాయలు వచ్చింది.