Leading News Portal in Telugu

Gold Price Today: పండగల వేళ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?


Gold Price Today: పండగల వేళ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today in Hyderabad on 22nd October 2023: దసరా పండగల వేళ బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. పండగకు ముందు పెరుగుతూ వస్తున్నాయి. బులియన్ మార్కెట్‌లో ఆదివారం (అక్టోబర్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,750గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 220 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,750లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,900గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,700లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,850గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్‌, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,750గా కొనసాగుతోంది.

మరోవైపు వెండి ధర కూడా నేడు పెరిగింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 75,300లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 1200 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 75,300లు ఉండగా.. చెన్నైలో రూ. 78,700గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74,500గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 78,700లుగా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,700గా కొనసాగుతోంది.