
చలికాలం అంటే జనాలు భయపడుతున్నారు.. అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.. ఇక చర్మం పొడి బారుతుంది… దాంతో మనం విటమిన్ సి ఎక్కువగా ఉండే వివిధ రకాల పండ్లల్లో మోసంబి కూడా ఒకటి. వీటిని జ్యూస్ గా చేసి తీసుకుంటూ ఉంటాము. మోసంబి జ్యూస్ పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది.. అంతేకాదు ఎన్నో రకాలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.. ఇతర పండ్ల రసాలను తాగినట్టుగా మోసంబి జ్యూస్ ను కూడా తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో తప్పకుండా తీసుకోవాలని వారు చెబుతున్నారు. మోసంబిలో విటమిన్ సి తో పాటు అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ పండ్లతో చేసిన జ్యూస్ ను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.. అవేంటో ఒకసారి చూసేద్దాం..
ఈ జ్యూస్ ను చలికాలంలో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది..ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల పొట్టలో కదలికలు పెరుగుతాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అలాగే ఈ జ్యూస్ ను తాగడం వల్ల నోట్లో ఉండే రుచి మొగ్గలు ఉత్తేజానికి గురి అవుతాయి. దీంతో నోటికి ఏదైనా తినాలన కోరిక కలుగుతుంది.. వాంతులు, వీరేచనాలు తగ్గుతాయి.. ఎనర్జీగా ఉంటారు.. రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది..
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.. ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరం డీహ్రైడేషన్ కు గురి కాకుండా ఉంటుంది. చర్మం పొడి బారకుండా తేమను కలిగి ఉండేలా చేస్తుంది.. అలాగే శరీరంలో మలినాలు తొలగిపోతాయి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది. ఇక జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, బరువు తగ్గడంలో కూడా ఈ జ్యూస్ మనకు సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలు ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని ప్రతి ఒక్కరు శీతాకాలంలో తీసుకునే ప్రయత్నం చేయాలని అప్పుడే వాతావరణ మార్పుల కారణంగా కలిగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.. ఇంకా ఎన్నో సమస్యలు తగ్గిపోతయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..