
క్రికెట్ అభిమానులకు శుభవార్త. రిషబ్ పంత్ ఐపీఎల్ 2024లో ఆడనున్నాడు. అందుకు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్కు రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తాడని సౌరవ్ గంగూలీ చెప్పాడు. ఇంతకుముందు రిషబ్ పంత్ పునరాగమనంపై డౌట్ ఉన్నప్పటికీ, సౌరవ్ గంగూలీ ట్వీట్ రిషబ్ పంత్ రాబోయే ఐపీఎల్ సీజన్లో ఆడతాడని స్పష్టం చేసింది.
రిషబ్ పంత్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్తో ఆడాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుంచి.. రిషబ్ పంత్ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో పునరావాసం చేస్తున్నాడు. గాయం కారణంగా అతను ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023కి దూరమయ్యాడు. మీడియా నివేదికల ప్రకారం.. టీమిండియాలోకి తిరిగి రాకముందే రిషబ్ పంత్ దేశవాళీ మ్యాచ్లలో చూడవచ్చు. అంతేకాకుండా.. ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ ఆడటం కూడా ఖాయమైంది. దీంతో.. రిషబ్ పంత్ ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా కనిపించనున్నాడు.
ఇటీవల.. ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్శిటీ మైదానంలో తన ఆటగాళ్ల కోసం ఒక శిబిరాన్ని నిర్వహించింది. టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ, ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ల పరిశీలనలో శిక్షణ, ప్రాక్టీస్ గేమ్లలో పాల్గొన్నాడు. రిషబ్ పంత్ తిరిగి యాక్షన్లో చూడడాన్ని అభిమానులు ఇష్టపడ్డారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
According to recent news Rishabh Pant is in Kolkata in the practice camp of Delhi Capitals
Sourav Ganguly and Ricky Ponting are also with him, Rishabh will also play practice matches thereNo Knee Strap
Also he is Walking Flawlessly
Things are turning in our favour
😭🥹❤️ pic.twitter.com/X3m6Ml3cZo— Sandy (@sandyhuyar) November 9, 2023