Leading News Portal in Telugu

Srisailam Temple: శ్రీశైలంలో భక్తుల రద్దీ.. స్పర్శ దర్శనాలు రద్దు చేసిన అధికారులు



Srisailam

Srisailam Temple: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం భక్తుల రద్దీ పెరిగిపోయింది.. రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానుండగా.. ఇప్పటికే భక్తులతో కిటకిటలాడుతోంది.. కాగా, రేపటి నుంచి డిసెంబర్‌ 12వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనుంది శ్రీశైలం దేవస్తానం.. భక్తుల రద్దీ దృష్ట్యా.. శ్రీ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునే భక్తులకు కీలక సూచనలు చేశారు అధికారులు.. స్వామివారి ఆలయంలో నిర్వహించే గర్భాలయ, సామూహిక అభిషేకాలను రద్దు చేసినట్లు ఈవో పెద్దిరాజు వెల్లడించారు.. ఇక, శనివారం, ఆదివారం, సోమవారంతో పాటు సెలవురోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్ననేపథ్యంలో.. స్వామివారి స్పర్శ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. అంటే.. వారాంతంలో భక్తుల రద్దీ ఉండే నేపథ్యంలో.. మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనాలు ఏర్పాటు చేసింది దేవస్థానం.. దీనికి సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌ బుక్‌చేసుకోవాలని శ్రీశైలం ఆలయం ఈవో పెద్దిరాజు వెల్లడించారు.. కాగా, కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. కార్తీక స్నానాలు చేసేవారు, కార్తీక దీపాలు వెలిగించేవారు.. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులతో శ్రీశైలంలో క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోన్న విషయం విదితమే.

Read Also: PM Kisan New: నాలుగు కోట్ల మందికి ‘పీఎం కిసాన్’ దూరం.. ప్రభుత్వానికి రూ.46000కోట్లు ఆదా