Leading News Portal in Telugu

శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు | south central railway special trains to sabarimalai| 22| sleeper| coach| reserved| unreserved


posted on Nov 21, 2023 8:59AM

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్ళను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం(నవంబర్ 20) ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 26 నుంచి మొదలౌతాయి.  సికింద్రాబాద్-కొల్లం ప్రత్యేక రైలు ఈ నెల  26న, అలాగే డిసెంబరు 3వ తేదీనా నడపనుంది.

ఇక కొల్లం-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఈ నెల 28, డిసెంబరు 5న నడుస్తుంది. అలాగే నర్సాపూర్-కొట్టాయం ఈ నెల 26, డిసెంబరు 3తేదీలలోనూ, తిరుగు ప్రయాణం కోసం కొట్టాయం-నర్సాపూర్  ప్రత్యేక రైలు ఈ నెల 27, డిసెంబరు 4 తేదీలలోనూ ఉంటుంది. ఇక కాచిగూడ నుంచి కొల్లం వెళ్లే స్పెషల్ ట్రైన్  డిసెంబర్ 9, 22, 29  తేదీలలో ఉంటుంది.

అలాగే కొల్లం నుంచి కాచిగూడకు వచ్చే ప్రత్యేక రైలు  24, డిసెంబరు 1, 8; కాకినాడ-కొట్టాయం ఈ నెల 23, 30, కొట్టాయం-కాకినాడ ఈ నెల 25, డిసెంబరు 2; సికింద్రాబాద్-కొల్లం ఈ నెల 24, డిసెంబరు 1; కొల్లం-సికింద్రాబాద్ ఈ నెల 25, డిసెంబరు 2 తేదీల్లో  ఉంటాయి. వీటిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ బోగీలతో పాటు స్లీపర్, జనరల్ కోచ్ లు ఉంటాయి.