Leading News Portal in Telugu

AP TDP: రాష్ట్రంలో ఓటర్ల జాబితా అవకతవకలపై ఈసీకి టీడీపీ నేతల ఫిర్యాదు..



Telangana Tdp

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాపై ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై ప్రతిపక్ష నేతలు.. విపక్ష టీడీపీపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదు కూడా చేసుకున్నారు.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి కూడా సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు.. కొందరు అధికారులపై వేటు కూడా పడింది.. అయితే, మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణల నేపథ్యంలో.. టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ను టీడీపీ బృందం కలిసింది. అధికార పార్టీ ఒత్తిడితో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read Also: ICC: దక్షిణాఫిక్రాలో అండర్-19 వరల్డ్ కప్.. శ్రీలంక నుంచి షిఫ్ట్

కాగా, మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ లభించడంతో టీడీపీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని ఇటీవల టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు అరెస్ట్‌కు ముందు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో మరోసారి తెలుగు తమ్ముళ్లు ఢిల్లీ బాట పట్టారు. వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారని.. ఇదే సమయంలో విపక్షాల మద్దతుదారుల ఓట్లు పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.