పోలింగ్ విధులు నిర్వర్తించే సిబ్బందికి ఈసీ మెనూ ఇదే! | ec menu for poling personnel| 15members| per| polingstation| menu| chicken
posted on Nov 27, 2023 3:12PM
తెలంగాణలో పోలింగ్ రోజున విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఎన్నికల సంఘం మెనూ రెడీ చేసింది. ఈ నెల 30న తెలంగాణలో పోలింగ్ జరగనున్న సంగతి విదితమే. ఎన్నికలలో విధుల కోసం ప్రతి పోలింగ్ స్టేషన్ లో 15 మంది విధులు నిర్వహిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులలో ఉండే సిబ్బంది, అధికారులకు ఓకే మోనూను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఒక్కో పోలింగ్ స్టేషన్ లో నలుగురు పోలింగ్ పర్సన్స్, ఒక మైక్రో అబ్జర్వర్, ఒక వెబ్ కాస్టింగ్ పర్సన్, ఒక బీఎల్ఓ, ఇద్దరు వాలంటీర్లు, ఇద్దరు స్వీపర్ /అటెండర్, ఇద్దరు పోలీసులు మొత్తం 12 మంది ఉంటారు. వీరికి అదనంగా మరో ముగ్గురు రిజర్వులో ఉంటారు. వీరి విధులు నవంబర్ 29న ప్రారంభం అవుతాయి.
నవంబర్ 29న డిస్ట్రిబ్యూషన్ సెంటర్, 30న పోలింగ్ సెంటర్ వద్ద వారికి అందించబోయే బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ కోసం ఒక్కో పోలింగ్ స్టేషన్ కు 3,800 రూపాయల చొప్పున వ్యయం చేయనుంది. ఈసీ మేరకు ఈ నెల 29న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద బ్రేక్ ఫాస్ట్ లోకి గోధుమ రవ్వ కిచిడీ, పల్లీల చట్నీ, టమాటా చట్నీ, చాయ్ ఇస్తారు. ఇక మధ్యాహ్నం లంచ్ కింద రైస్, వెజ్ కర్రీ, ఎగ్ పులుసు, సాంబార్ లేదా రసం, పెరుగు, పాపడ్, చట్నీ అందిస్తారు. సాయంత్రం స్నాక్స్ లో బిస్కెట్, టీ ఇస్తారు. ఇక పోలింగ్ రోజున ఉదయం ఆరు అరున్నర గంటల మధ్య టీ, బిస్కట్, ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది గంటల మధ్య బ్రేక్ ఫాస్ట్ కింద ఉప్మా, టమాటాచట్నీ అందిస్తారు. ఇక లంచ్ కింద రైస్, చపాతీ, వెజ్ కర్రీ, పప్పు, సాంబార్ లేదా రసం, పెరుగు, చట్నీ, బాయిల్డ్ ఎగ్ అందజేస్తారు. ఇక సాయంత్రం స్నాక్స్ గా టీ, బిస్కట్ ఇస్తారు. ఇక పోలింగ్ పూర్తి అయిన తరువాత డిన్నర్ లోకి చికెన్ కర్రీ అందిస్తారు. డిన్నర్ లో వెజిటెబుల్ పులావు, చపాతి, చికెన్ కర్రీ, వంకాయ మసాలా కర్రీ, పప్పు, సాంబార్, పెరుగు, పాపడ్ అందిస్తారు.