తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటలు | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi
posted on Dec 6, 2023 8:50AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (డిసెంబర్ 6)శ్రీవారి దర్శనం భక్తులు క్యూలైన్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా అనుమతిస్తున్నారు.
ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం (డిసెంబర్ 5) శ్రీవారిని 44 వేల 547 మంది దర్శించుకున్నారు.
వారిలో 13వేల 125 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల పాతిక లక్షల రూపాయలు వచ్చింది.