
Israel Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య అక్టోబర్ నుంచి యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ ఇప్పటివరకు గాజాలోని హమాస్కు భారీ నష్టం కలిగించింది. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడిలో దాదాపు 100 మంది పాలస్తీనియన్లు మరణించగా.. 158 మంది గాయపడ్డారు. గత 24 గంటల్లో సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో సుమారు 100 మంది పాలస్తీనియన్లు మరణించారని, 158 మంది గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా నివేదించింది. పాక్షిక కాల్పుల విరమణ తర్వాత, గాజాలో యుద్ధం కొనసాగుతుందని తెలిసిందే. ఇదిలా ఉండగా.. దీనిపై ఇంతవరకు ఇజ్రాయెల్ స్పందించకపోవడం గమనార్హం.