posted on Feb 13, 2024 6:34AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (ఫిబ్రవరి 13)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 20 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక సోమవారం (ఫిబ్రవరి 12) శ్రీవారిని 69వేల 314 మంది దర్శించుకున్నారు.
వారిలో పాతిక వేల 165 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 5 కోట్ల 48లక్షల రూపాయలు వచ్చింది.