Leading News Portal in Telugu

CM YS Jagan: రేపు రెండు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన


CM YS Jagan: రేపు రెండు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రేపు అనగా ఈ నెల 15వ తేదీన రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.. ఇప్పటికే వరుసగా ప్రభుత్వ కార్యక్రమాలు ఓవైపు.. పార్టీ కార్యక్రమాలు మరోవైపు.. ప్రైవేట్‌ కార్యక్రమాలు ఇంకో వైపు.. ఇలా నిత్యం బిజీగా గడుపుతోన్న వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌.. రేపు.. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తారు.. ఈ నెల 15వ తేదీన ఉదయం కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్నారు సీఎం జగన్‌.. ఇక, మధ్యాహ్నం తర్వాత గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొంటారు ఏపీ సీఎం..


ఇక, రేపు రెండు జిల్లాల పర్యటన కోసం.. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి కర్నూలు చేరుకుంటారు సీఎం జగన్‌.. అక్కడ బళ్లారి రోడ్‌లోని ఫంక్షన్‌ హాల్‌లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు.. ఆ తర్వాత మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి చేరుకోనున్న సీఎం జగన్‌.. ఆ తర్వాత గుంటూరు పర్యటనకు వెళ్తారు.. దీనికోసం.. రేపు మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి.. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి చేరుకుంటారు.. అక్కడ నిర్వహించనున్న వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి.. అనంతరం సాయంత్రం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.