Leading News Portal in Telugu

Abu Dhabi: అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన మోడీ


Abu Dhabi: అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన మోడీ

అబుదాబిలో (Abu Dhabi) నిర్మించిన తొలి హిందూ దేవాలయాన్ని (Hindu Temple) ప్రధాని మోడీ (PM Modi) ప్రారంభించారు. యూఏఈ చరిత్రలో నిర్మించిన తొలి హిందూ దేవాలయం ఇదే కావడం విశేషం. రెండ్రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రెండోరోజు మోడీ పర్యటన కొనసాగుతోంది. ఈ ఉదయం ప్రపంచ ప్రభుత్వ సదస్సులో మోడీ పాల్గొని ప్రసంగించారు.


అబుదాబిలోని అబు మురీఖా ప్రాంతంలో ఈ మందిరం 27 ఎకరాల్లో విస్తరించి ఉంది. 2019 ఏప్రిల్‌లో శంకుస్థాపన చేయగా.. అదే ఏడాది డిసెంబర్‌లో ఆలయ నిర్మాణ పనులు స్టార్ట్ అయ్యాయి. క్రౌన్స్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆలయ నిర్మాణం కోసం 2015లో 13.5 ఎకరాల భూమిని విరాళంగా అందించారు. 2019 జనవరిలో యూఏఈ ప్రభుత్వం మరో 13.5 ఎకరాలను ఆలయ నిర్మాణం కోసం గిఫ్ట్ ఇచ్చింది. ఈ హిందూ ఆలయ నిర్మాణానికి సుమారు 400 మిలియన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ లు ( రూ. 700 కోట్లు ) అయ్యాయి.