తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.07కోట్లు | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi
posted on Feb 15, 2024 8:59AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (ఫిబ్రవరి 15)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 18 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం (ఫిబ్రవరి 14) శ్రీవారిని మొత్తం 67వేల 275 మంది భక్తులు దర్శించుకున్నారు.
వారిలో పాతిక వేల 293 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల ఏడు లక్షల రూపాయలు వచ్చింది.