Leading News Portal in Telugu

Gold Price Today : షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?



Gld Price

బంగారం కొనాలని అనుకొనేవారికి షాకింగ్ న్యూస్.. బంగారం ధరలు భారీగా పెరిగాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. శనివారం 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 10 పెరిగి.. రూ. 57,110కి చేరింది..24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర సైతం రూ. 10 వృద్ధి చెంది.. రూ. 62,300కి చేరింది.. వెండి కూడా స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తుంది.. కేజీ వెండి ధర రూ. 100 పెరిగి 75,700కి చేరింది.ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం..

చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,610గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,850గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,110గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,300గాను ఉంది.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,260గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,450గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,110 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,300గా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,110గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,300గా నమోదైంది..

ఇక వెండి విషయానికొస్తే.. బంగారం పెరిగితే, వెండి కూడా అదే దారిలో నడిచింది. ఈరోజు కేజీ వెండి పై రూ. 100 పెరిగింది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 77,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 75,700.. బెంగళూరులో రూ. 70,800గా ఉంది.. ఈరోజు ధరలు స్వల్పంగా పెరిగాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..