
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు అట్టహాసంగా ప్రారంభమైంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జాతర కొనసాగనుంది. జాతరలో ముఖ్య ఘట్టమైన పగిడిద్దరాజు, గోవిందరాజులు నేడు గద్దెలపైకి రానున్నారు. అంతేకాకుండా.. మధ్యాహ్నం కన్నెపల్లి నుంచి గద్దెపైకి సారలమ్మను తీసుకురానున్నారు. అయితే.. మేడారం జాతరకు కోటిన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మేడారం జాతరకు 6 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది టీఎస్ఆర్టీసీ. ఇవాళ సమ్మక్క కూతురైన సారలమ్మ సాయంత్రం 4 గంటలకు గద్దెపై కొలువు దీరనుంది. సారలమ్మతో పాటు, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెపైకి చేరుకుంటారు. సంప్రదాయబద్దంగా ఆదివాసి, గిరిజన పూజారులు ఈ అమ్మవారిని గద్దెలపైకి తొడ్కొని రానున్నారు. ఇక ఫిబ్రవరి 22న చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి రానుంది. ఫిబ్రవరి 23న గద్దెలపై కొలువుదీరని తల్లులకు పూజలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 24న దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి.
Farmers Protest: ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం.. పోలీసుల పటిష్ట భద్రత
ఈ మహా జాతరకు తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ సహా మరికొన్ని రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. దాదాపు 2 కోట్ల మంది భక్తులు గద్దెలను దర్శించుకుంటారని అంచనా. ఈ మేరకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. 2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ మహా జాతరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నారు. ఫిబ్రవరి 23న రాష్ట్రపతి గద్దెలను దర్శించుకుంటారు. గవర్నర్ తమిళిసై సాందర రాజన్, సీఎం రేవంత్రెడ్డి కూడా అదే రోజు మేడారానికి వెళ్లనున్నారు.
Farmers Protest: ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం.. పోలీసుల పటిష్ట భద్రత