Leading News Portal in Telugu

Group -2: నేడు ఏపీలో గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష



Appsc

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్షను నేడు నిర్వహిస్తుంది. ప్రిలిమ్స్ పరీక్షలో పాల్గొనాలని భావిస్తున్న అన్ని నమోదిత అభ్యర్థులు తప్పనిసరిగా నిర్దేశించిన APPSC గ్రూప్ 2 పరీక్ష మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. కమిషన్. వారు తప్పనిసరిగా APPSC గ్రూప్ 2 అడ్మిట్ కార్డ్ మరియు చెల్లుబాటు అయ్యే ఫోటో ID ప్రూఫ్ యొక్క హార్డ్ కాపీని పరీక్ష హాల్‌కు తీసుకెళ్లాలి. పరీక్ష ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాల్లో గ్రూప్-2 రాత పరీక్షలు(APPSC Group 2 Exam ) జరుగనున్నాయని సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.

ఇవాళ ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకూ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు నిరంతర పర్యవేక్షణకు 24 మంది ఐఏఎస్ అధికారులు, 450 మంది రూట్ అధికారులు, 1330 మంది లైజనింగ్ అధికారులను నియమించామని సీఎస్ పేర్కొన్నారు. అదే విధంగా 24,142 మంది ఇన్విజిలేటర్లు, మరో 8500 ఇతర సిబ్బందిని ఆయా పరీక్షా కేంద్రాల్లో నియమించామన్నారు. అంతేగాక విస్తృత బందోబస్తు చర్యల్లో భాగంగా 3971 మంది పోలీసు సిబ్బందిని నియమించడంతో పాటు పరీక్షా పత్రాలు, జవాబు పత్రాలు కాన్ఫిడెన్సియల్ మెటీరియల్ నిర్దేశిత ప్రాంతాలకు సురక్షితంగా తరలించేందుకు వీలుగా 900 మంది ఎస్కార్ట్ సిబ్బందిని నియమించామని తెలిపారు. అలాగే మొత్తం పరీక్షల తీరును ఏపీపీఎస్సీ నుంచి 51 మంది అధికారులు పర్యవేక్షించనున్నారని సీఎస్ పేర్కొన్నారు.