posted on Mar 2, 2024 11:43AM
బిఆర్ఎస్ హాయంలో జరిగిన అక్రమాలను ఒక్కోటి బయటకు తీయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ ఉపక్రమించింది. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు చేసిన కబ్జాలు వెలుగులోకి తెచ్చి పరిష్కార మార్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెతుకుతోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ తగిలింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండీఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. 2,500 గజాల భూమిని ఆక్రమించి ఈ రోడ్డును నిర్మించారు. తన కాలేజీ కోసం మల్లారెడ్డి ఈ రోడ్డును నిర్మించుకున్నారు. అయితే, ఈ వ్యవహారంపై గతంలో ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, రేవంత్ సీఎం అయిన తర్వాత ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎండీఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును శనివారం అధికారులు తొలగించారు.