Leading News Portal in Telugu

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi


posted on Mar 8, 2024 8:03AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం (మార్చి 8) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 18 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని 57వేల 880 మంది భక్తులు సందర్శించుకున్నారు.

వారిలో 19 వేల 772 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 15లక్షల రూపాయలు వచ్చింది.