Leading News Portal in Telugu

Perni Nani : నాని ప్రజలతో ప్రభుత్వ స్థలాలలో ఏరోజు పాకలు వేయించలేదు



Perni Nani

దొంగపట్టా ఇచ్చిన దొంగ, మోసగాడు…..దగాకోరు..కొల్లు రవీంద్ర అని ధ్వజమెత్తారు పేర్ని నాని. పేర్ని నాని బతికి ఉన్నంత కాలం పేదొడు దర్జాగా, ధైర్యంగా బ్రతుకుతారు…అలానే బ్రతికిస్తానని పేర్నినాని వ్యాఖ్‌యానించారు. మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడచిన రెండు రోజులుగా కొల్లు రవీంద్ర ఓటమి భయంతో అధికారులను బెదిరిస్తూ అవాకులు చవాకులు పెలుతున్నరు అని ఘాటుగా వ్యాఖ్యానించారు పేర్ని నాని. బలరాంపేట వడ్డెర బస్తీలో పార్కు స్థలం కమ్యూనిటీ హాల్ ఇచ్చి రోజువారి కూలి చేసుకునే మా వడ్డెర సోదరులను మోసం చేశావని, అధికారం లో ఉన్న లేకపోయినా పేర్ని నాని, పేర్ని కృష్ణ మూర్తి పేద, మధ్యతగతి ప్రజల పక్షాన నిలిచిన వ్యక్తులు అని ఆయన మండిపడ్డారు.

అంతేకాకుండా..’నాని ప్రజలతో ప్రభుత్వ స్థలాలలో ఏరోజు పాకలు వేయించలేదు. ఆర్ధికంగా పేదరికం లో ఉండి రోడ్ పక్కన ఉన్న వారికి పక్క ఇల్లు నిర్మాణం కోసం స్థలాలు కేటాయించినది పేర్ని నాని. రాజకీయ నాయకుల దయతో బ్రతకలా? ఓట్లు కోసం నిచ రాజకీయం కు తెరలేపారు.. పదవి పోతున్న పది రోజుల్లో విలేఖర్లకు కొల్లు రవీంద్ర ఇంటి పట్టాలు ఇచ్చారు ఎటువంటి సర్వై నుంబర్లు లేకుండా. విలేఖర్లకు ఇచ్చిన స్థలాల రికార్డులు ఎందుకు మాయం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజుపేట చెందిన మీ కార్యకర్తలు హయత్ ఖాన్ కు ఇచిన్నవి దొంగ పట్టాలు.పేదొడికి పేర్ని నాని ఇచిన్నవి కావు. చిలకలపూడి పాండు రంగ పాఠశాల దగ్గర ఒకే ఇంటికి నాలుగు ఇంటి పట్టాలు ఇచ్చిన ఘనుడివి నువ్వు కొల్లు రవీంద్ర. 1977-78 తుఫాన్ లో నష్ట పోయినా గిరిపురం మత్యకారులకు ఒక్కరి కైన కొల్లు మంత్రిగా ఉన్న సమయం లో ఇంటి పట్ట ఇచ్చిన పాపాన పోలేదు. మచిలీపట్నం పేద మధ్య తరగతి ప్రజలు ఉన్న ప్రాంతం లో రోడ్లు,తాగునీటి సదుపాయం చేసింది పేర్ని నాని. గుమటాల చెరువు లో ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని ఇల్లు నిర్మించారు వారికి పట్టాలు ఇవ్వలేదు ఇవ్వగలవా ?? రేపు రాన్నున ఎన్నికలలో 2024 జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు.నా కుమారుడు పేర్ని కిట్టు యం. ఎల్. ఏ అవటం ఖాయం అదే గుమ్మటల చెరువు లో ఇల్లు వేసుకున్న ప్రజలకు నా కుమారుడు పట్టాలు ఇస్తాడు మీరు చూస్తూ ఉండండి.. రానున్న రోజులలో ప్రజలే నిర్ణయిస్తారు కొల్లు రవీంద్ర ఎటువంటి వాడో పేర్ని నాని ఎటువంటి వాడో…’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.