
Lok sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది. విజ్ఞాన్భవన్ ప్లీనరీ హాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ తో పాటు జ్ఞానేశ్కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధులతో కలిసి ఎన్నికల షెడ్యూల్ను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు. 18వ లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను వెల్లడించారు. కాగా, ప్రస్తుత లోక్సభకు జూన్ 16తో గడువు ముగియనుంది. దీంతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల కమిషన్.. స్థానిక రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలను నిర్వహించింది.