
ఫోన్టాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, ఈ కేసులో నిందితుడు ప్రణీత్ రావు మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. పోలీస్ కస్టడీ ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను.. సవాల్ చేస్తూ డీఎస్పీ ప్రణీత్ రావు తరఫు న్యాయవాది, హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవాంశాలను పరిగణలోకి తీసుకోకుండా, కిందికోర్టు కస్టడీకి ఇచ్చిందని ప్రణీత్ రావు తన పిటీషన్లో పేర్కొన్నారు. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదన్నారు ప్రణీత్ రావు. పీఎస్లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవని పిటీషన్లో ప్రణీత్ రావు పేర్కొన్నారు. విచారణ పూర్తైన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలలని ప్రణీత్ రావు పటిషన్లో కోరారు.
దర్యాప్తులోని అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారన్నారని, ఎందుకు లీక్ చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. రహస్యం పేరుతో బంజారాహిల్స్ పీఎస్లో విచారిస్తున్నార్న ప్రణీత్ రావు న్యాయవాది.. బంధువులు, న్యాయవాదిని కూడా అనుమతించడం లేదన్నారు. ఇంటరాగేషన్లో ఏఎస్పీ డి.రమేశ్ పాల్గొనకుండా నియంత్రించాలని ప్రణీత్ రావు కోరారు. ఇప్పటికే సమాచారం అందించినందున కస్టడీ రద్దు చేయాలని ప్రణీత్ రావు కోరారు. ప్రణీత్రావు కస్టడీపై పోలీసుల వివరణ కోరుతూ విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.