
TS BJP: లోక్ సభ షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ‘టార్గెట్ కాంగ్రెస్’ వ్యూహంతో బీజేపీ ముందుకు సాగుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న అధికార బీఆర్ఎస్పై కాకుండా కాంగ్రెస్పైనే ప్రధానంగా దృష్టి సారించింది. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి రాష్ట్ర ముఖ్య నేతలు కిషన్ రెడ్డి, కె. లక్ష్మణ్ తదితరుల వరకు అందరూ హస్తం పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కాంగ్రెస్ , బీఆర్ఎస్ టార్గెట్ గా తెలంగాణ ఇంఛార్జి తరుణ్ చుగ్,బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ నేడు రాష్ట్రానికి రానున్నారు.
ఇవాళ తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ తెలంగాణాలో ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చించనున్నారు. జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీలకు కీలకంగా మారిన లోక్ సభ ఎన్నికలు.. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కు సీట్లు తగ్గించి, అదే సమయంలో మెజార్టీ సీట్లను కైవసం చేసుకునేందుకు కార్యాచరణను అమలు చేస్తున్నాయి. విమర్శల దాడి క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడున్నర నెలలు అవుతోంది. రైతు భరోసా, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నలు సంధిస్తున్నారు.
రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో 15 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులు కూడా తమ నియోజకవర్గాల్లో ప్రచారం ప్రారంభించారు. రాష్ట్రంలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూనే.. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. బీఆర్ఎస్ ఎంపీ సీట్లు గెలిచి జాతీయ స్థాయిలో చేసేదేమీ లేదు. కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్లీ పాలన, అక్రమాలు వస్తాయని ఆరోపించారు. బీజేపీని అత్యధిక స్థానాల్లో గెలిపిస్తామని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతాన్ని ప్రజలు రెట్టింపు చేశారు. ఈసారి రెండంకెల ఎంపీ సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కనీసం పది ఎంపీ సీట్లైనా గెలవాలని బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీని ఆదేశించింది. దీంతో పాటు మరో రెండు సీట్లు గెలుచుకునేందుకు కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు.
Himanta Biswa Sarma : ఆయనే అరెస్ట్ ను ఆహ్వానించారు.. కేజ్రీవాల్ పై సీఎం సంచలన వ్యాఖ్యలు