
ఆంధ్రప్రదేశ్లోని పింఛనుదారులకు ఏప్రిల్ లో రెండు రోజులు ఆలస్యంగా చెల్లింపులు జరుగుతాయని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మంగళవారం తెలిపారు. ఈ సందర్బంగా “మేము నెల మొదటి తేదీన పెన్షన్ లను పంపిణీ చేస్తున్నామని, ఇక వచ్చే నెల మొదటి రోజు ఏప్రిల్ 1 న, ఆర్బిఐ కి సెలవుదినం, ఆ తరువాత ఆదివారం రావడం వల్ల ఈ మేరకు మూడో తేదీన (ఏప్రిల్ 3) పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించాం’’ అని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి తెలిపారు.
Also Read: TDP vs Janasena: తిరుపతిలో అనూహ్య పరిణామాలు.. జనసేన పోటీపోటీ సమావేశాలు..! టీడీపీ రహస్య భేటీ..!
ఇక ఇతర క్యాబినెట్ నిర్ణయాలను ఆయన వివరిస్తూ, షెడ్యూల్డ్ కులాల సబ్ప్లాన్ ను మరో దశాబ్దానికి పొడిగించడంతో సహా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చట్టం 2019కి సవరణ ముసాయిదా బిల్లు ఆమోదించబడినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పర్యవేక్షణ, సౌకర్యాలను మరింత పెంచడానికి., గతంలో మాదిరిగా కాకుండా మూడు మండలాలకు కలిపి సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం మరియు బీసీ సంక్షేమ శాఖల కోసం ఒక క్లస్టర్ ను రూపొందించడం ద్వారా మండల స్థాయి వరకు బాధ్యతలను పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఏడాదిలోగా సహాయ సంక్షేమ అధికారిని నియమించాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు.
Also Read: Rangareddy: రేపు హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి..?
వీటితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ చైర్మన్ పదవీకాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే, అవసరమైతే ప్రభుత్వం చైర్మన్ పదవీకాలాన్ని రెండు పర్యాయాలకు పొడిగించవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. అనేక ఇతర నిర్ణయాలతో పాటు వెనుకబడిన తరగతుల కమిషన్ పై కూడా కేబినెట్ ఇదే నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు.