
పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. సీబీఐ దర్యాప్తు కొనసాగించడానికి మాత్రం సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే ఏ అధికారి లేదా అభ్యర్థిపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం సూచించింది.