Leading News Portal in Telugu

Renukaswamy Case: దర్శన్ ను కలిసి చిక్కుల్లో పడ్డ కమెడియన్?


  • రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ & పవిత్ర గౌడ ప్రధాన నిందితులు

  • పరప్ప అగ్రహార జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా దర్శన్

  • దర్శన్‌ను కలిసేందుకు జైలుకు వెళ్లిన నటుడు చిక్కన్నకు కొత్త చిక్కులు
Renukaswamy Case: దర్శన్ ను కలిసి చిక్కుల్లో పడ్డ కమెడియన్?

Police Will Be Serve Notice To Actor Chikkanna in Renukaswamy Case: చిత్రదుర్గ రేణుకా స్వామి హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్ తూగుదీపను కలిసి మాట్లాడిన హాస్యనటుడు చిక్కన్న చిక్కుల్లో పడ్డాడు. ఆయనని మరోసారి విచారించాలని పోలీసులు నిర్ణయించారు. రేణుకాస్వామి హత్యకు ముందు జూన్ 8న దర్శన్‌తో పాటు కేసులో నిందితులు ఆర్‌ఆర్‌నగర్‌లోని స్టోనీ బ్రూక్ పబ్‌లో పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో నటుడు చిక్కన్న కూడా పాల్గొనడంతో పోలీసులు అతడిని ముందుగా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అలాగే చిక్కన్న వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట సీఆర్‌పీసీ 164 కింద నమోదు చేశారు. నటుడు దర్శన్ సహా ఇతర నిందితులపై చిక్కన్న వాంగ్మూలాన్ని ముఖ్యమైన సాక్షిగా పరిగణించాలని పోలీసులు న్యాయమూర్తి ముందు వాంగ్మూలం దాఖలు చేశారు. భవిష్యత్తులో తన వాంగ్మూలాన్ని మార్చుకుంటే విచారణ ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున అతని వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట రికార్డ్ చేశారు. అనంతర పరిణామంలో చిక్కన్న పరప్ప అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లి నిందితుడు దర్శన్‌ను కలిశాడు.

Mia Khalifa: మోసం చేసి పోర్న్ స్టార్ ని చేశాడు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన మియా ఖలీఫా

సాధారణంగా కేసు విచారణలో ఉన్న సమయంలో సాక్షి నిందితులను జైలులో కలవరు. అయితే రేణుకాస్వామి హత్య కేసు విచారణలో ఉన్న సమయంలో చిక్కన్న దర్శన్‌ను కలిశాడు. దీంతో పోలీసులు చిక్కన్నకు నోటీసులిచ్చి విచారించనున్నారు. నిందితుడు దర్శన్‌ను ఏ ఉద్దేశ్యంతో కలిశారు? నిందితుడితో ఆయన ఏం మాట్లాడాడు? అనే విషయంపై పోలీసులు చిక్కన్నను ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో పాటు సాక్షి, నిందితుల మధ్య జరిగిన భేటీకి సంబంధించిన సమాచారాన్ని కూడా పోలీసులు జైలు అధికారుల నుంచి రాబట్టనున్నారు. అలాగే ఈ కేసులోని సాక్షులు దర్శన్‌ను కలవకుండా అడ్డుకోవాలని సిట్‌ కోర్టును ఆశ్రయించనుంది. చిక్కన్నతో పాటు ఈ కేసులో సాక్ష్యం చెప్పిన చాలా మంది జైలుకు వెళ్లి దర్శన్‌ను కలిశారని, వారందరినీ విచారించే ప్రక్రియ మొదలైంది. జైలులో దర్శన్‌ను కలిసిన వ్యక్తుల సమాచారం సేకరించిన పోలీసులు.. వారందరికీ నోటీసులు జారీ చేసి విచారించాలని నిర్ణయించారు. రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుందని, త్వరలోనే చార్జిషీటును కోర్టుకు సమర్పిస్తామని నగర పోలీసు కమిషనర్ బి.దయానంద్ తెలిపారు.