- టీ కాంగ్రెస్సే మోడీకి బీ టీమ్ గా పని చేస్తోంది..
-
రేవంత్ సీఎం కావడం మోడీ చాయిసే..

Jagadish Reddy: మోడీ దగ్గర రేవంత్ రెడ్డి కి ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి , బండి లకు లేదని మాజీమంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ కాంగ్రెస్సే మోడీకి బీ టీమ్ గా పని చేస్తోందని అన్నారు. రేవంత్ సీఎం కావడం మోడీ చాయిసే అన్నారు. వాల్మీకి కుంభకోణంలో టీ కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉన్నా బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడంలేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ , బీజేపీలు కలిసి కేసీఆర్ పై అక్కసు వెళ్లగక్కి వారి బలహీనతలను బయటపెట్టుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో రాహుల్ , రేవంత్ లు విరుద్ధంగా మాట్లాడుతున్నారన్నారు. అయితే గయితే పీసీసీ సహా తెలంగాణా కాంగ్రెస్ ఏ.. బీజేపీ లో విలీనమౌతుందన్నారు. బీఆర్ఎస్ ఏ పార్టీలో విలీనం కాదని క్లారిటీ ఇచ్చారు. ఎప్పటికయినా మోడీ , రాహుల్ కి ప్రత్యామ్నాయం కేసీఆర్ ఏ.. అన్నారు.
Read also: KTR Viral Tweet: ప్రజాపాలన కాదు ఇది.. ప్రతీకార పాలన.. కేటీఆర్ ట్వీట్ వైరల్
ఎమ్మెల్సీ కవిత బెయిల్ అంశం మీద కాంగ్రెస్ , బీజేపీ ల కామెంట్స్ పై జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కవిత బెయిల్ అంశం పై కాంగ్రెస్, బీజేపీలవి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టుని తప్పు బట్టే పద్ధతుల్లో కొంతమంది సోయిలేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. నిరాధారమైన కేసని మొదటి నుండి చెబుతున్నామన్నారు. మేం ఊహించినట్లుగానే కవిత ముత్యంలా బయటకు వచ్చిందన్నారు. చరిత్రల్లో సీబీఐ , ఈడీలు నమోదు చేసిన పరమ చెత్త కేసుల్లో ఇదొకటి అని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ , కేజ్రీవాల్ ని ఇబ్బందిపెట్టడానికే ఈ కేసు పెట్టారన్నారు. విచారణ సందర్బంగా ఆధారాలు లేకపోవడంతో ఈడీ సీబీఐ న్యాయవాదులు ఇబ్బందిపడ్డారన్నారు. నోట్ల కట్టలతో పట్టపగలు దొరికి అధికారం చేలాయిస్తున్న మీరు నిరాధార కేసులో కవిత బెయిల్ పై వస్తే ఏడుపెందుకు అన్నారు. టీ కాంగ్రెస్సే మోడీకి బీ టీమ్ గా పని చేస్తోందని అన్నారు.
Kunamneni Sambasiva Rao: ‘హైడ్రా’ అనే పేరు భయానకంగా ఉంది.. కూనంనేని కీలక వ్యాఖ్యలు