- ఆంధ్ర తెలంగాణలో వరుణుడి విలయం
- నీట మునిగిన విజయవాడ – ఖమ్మం
- ఆర్థిక సాయం ప్రకటించిన టాలీవుడ్

ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వరదలు సంభవించి ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో తాము ప్రజకు అండగా ఉంటాం అని ముందడుగు వేసింది చిత్రపరిశ్రమ. వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ తమ వంతుగా ఆర్థిక సాయం చేసింది. జూనియర్ ఎన్టీయార్, పవన్ కళ్యాణ్, అశ్వనీదత్, మహేశ్ బాబు, విశ్వక్ సేన్, అల్లు అర్జున్, రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా ఆర్థిక సాయం ప్రకటించారు.