Leading News Portal in Telugu

Indore: బ్యాంక్ ఉద్యోగి భార్యపై ఆర్మీ సైనికుడు అత్యాచారం.. తర్వాత ప్రైవేట్ పార్ట్‌లో..!


  • ఇండోర్‌లో హృదయ విదారక ఘటన

  • బ్యాంకు ఉద్యోగి భార్యపై ఆర్మీ జవాను అత్యాచారం

  • అత్యాచారం అనంతరం ఆమె ప్రైవేట్ పార్ట్‌లో గ్లాస్‌ని చొప్పించిన నిందితుడు

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ

  • నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.
Indore: బ్యాంక్ ఉద్యోగి భార్యపై ఆర్మీ సైనికుడు అత్యాచారం.. తర్వాత ప్రైవేట్ పార్ట్‌లో..!

ఇండోర్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. బ్యాంకు ఉద్యోగి భార్యపై ఆర్మీ జవాను అత్యాచారం చేశాడు. నిందితుడు మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె ప్రైవేట్ పార్ట్‌లో గ్లాస్‌ని చొప్పించాడు. ఆ బాధతో అతి కష్టం మీద పోలీస్ స్టేషన్ కు వచ్చి బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో.. నిందితుడిని అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి ఏబీ రోడ్డులోని ఓ హోటల్‌లో జరిగింది. నిందితుడు సంజయ్ యాదవ్ తనను కలవాలని మహిళను ఓ హోటల్‌కు పిలిచాడు. అనంతరం.. మహిళపై అత్యాచారం చేశాడు, అంతటితో ఆగకుండా.. ఆమె ప్రైవేట్ పార్ట్‌లో గ్లాస్‌ని పెట్టాడు. ఈ ఘటనపై బాధితురాలు శనివారం మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు నిందితుడు సంజయ్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

బాధిత మహిళ, నిందితులు ఏడాది క్రితం మోవ్ ఆర్మీ క్యాంటీన్‌లో కలుసుకున్నారని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కౌశల్య చౌహాన్ తెలిపారు. శుక్రవారం నిందితుడు బాధితురాలిని కలిసేందుకు ఇండోర్‌కు వచ్చాడు. వారిద్దరూ ఓ హోటల్‌లో బస చేసి, నిందితుడు ఈ నీచమైన చర్యకు పాల్పడ్డాడు. నిందితుడు మహిళను బ్లాక్ మెయిల్ చేసి కొంత డబ్బు కూడా తీసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం.. బాధిత మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడిగా గుర్తించారు. ప్రస్తుతం అతను అస్సాంలో ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు.