- గర్బాపై పాట రాసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..
-
ఈ పాటకు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసిన ప్రధాని మోడీ.. -
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన గర్భాపై ప్రధాని రాసిన పాట..

PM Modi: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గర్బా నృత్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకమైన పాటను రాశారు. ఈ పాటను గాయని పూర్వా మంత్రి పాడారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను నేడు ప్రధాని తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. ఈ పవిత్ర నవరాత్రుల్లో దుర్గాదేవిని ప్రజలు ఐక్యంగా ఆరాధిస్తారని చెప్పుకొచ్చారు. ఈ ప్రత్యేక సమయంలో అమ్మవారి శక్తి, దయను కీర్తిస్తూ అవటికలయ అనే గర్బా పాటను నేను రచించాను అని ప్రధాని తెలిపారు. మనందరిపైనా అమ్మవారి కృప ఉండాలన్నారు. ఇక, గాయని పూర్వా మంత్రి తన అద్భుతమైన స్వరంతో దీనిని ఆలపించారని ప్రధాని మోడీ మరో పోస్టులో ఆమెకు ధన్యవాదాలు చెప్పారు.
ఇక, గతేడాది కూడా శరన్నవరాత్రుల వేళ గర్బాపై ప్రత్యేకమైన కవితను నరేంద్ర మోడీ రాశారు. అది మ్యూజిక్ వీడియో రూపంలో అప్పుడు రిలీజ్ అయింది. చాలా ఏళ్ల కిత్రం దీన్ని రాశాను.. ఇప్పుడు ఈ గీతాన్ని వింటుంటే పాత స్మృతులు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. అంతేకాదు, గర్బాపై మరో పాటను కూడా తాను రాశాను.. నవరాత్రి సందర్భంగా అందరితో ఆ పాటను పంచుకుంటానని గతంలో ఆయన చేసిన ట్విట్టర్ పోస్టులో చెప్పారు. ఆ పాటకు గాయని ధ్వని భానుశాలి గాత్రాన్ని అందివ్వగా, స్వరాలను బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్ బాగ్చి సమకూర్చారు. జేజస్ట్ మ్యూజిక్ సంస్థ ఆ పాటను చిత్రీకరణ చేసింది.
It is the auspicious time of Navratri and people are celebrating in different ways, united by their devotion to Maa Durga. In this spirit of reverence and joy, here is #AavatiKalay, a Garba I wrote as a tribute to Her power and grace. May Her blessings always remain upon us. pic.twitter.com/IcMydoXWoR
— Narendra Modi (@narendramodi) October 7, 2024